Schneider Electric ties up with AP govt to set up 20 labs, train 9,000 youth in power, solar, and automation skills, with placement support.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు నైపుణ్యాల అభివృద్ధిలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యుత్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమేషన్ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలకు యువతను సన్నద్ధం చేయనున్నారు.
2024 ఏప్రిల్ నుండి 2027 మార్చి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 ఆధునిక శిక్షణా ల్యాబ్స్ను ష్నైడర్ ఏర్పాటు చేయనుంది. ఈ ల్యాబ్స్లో ఆధునిక విద్యుత్ వ్యవస్థలు, సౌరశక్తి పరికరాలు, పారిశ్రామిక ఆటోమేషన్ వంటి ఆధునిక శిక్షణా సామగ్రి అందుబాటులో ఉంటుంది. ఇందులో 9 వేలమంది యువతకు ప్రామాణిక శిక్షణ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ల్యాబ్ ఏర్పాటుకు కావలసిన పరికరాలు, డిజిటల్ శిక్షణా సామగ్రి కోసం ష్నైడర్ రూ. 5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ ఫౌండేషన్ సహకారం అందించనుంది. మంగళగిరిలో రూ. 15 కోట్లతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ స్థాపించేందుకు కూడా కంపెనీ అంగీకరించింది.
ఈ కార్యక్రమం అమలుకు ఎంపికైన కేంద్రాల్లో నాలుగు న్యాక్ సెంటర్లు, తొమ్మిది ప్రభుత్వ ఐటీఐలు, ఏడు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. అనంతపురంలో రీసెర్చ్ సెంటర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోడ్రన్ పవర్ ప్రాజెక్ట్ కూడా చేపట్టనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఏపీ యువత భవిష్యత్తుకు గట్టినేలు వేసే అవకాశం కలిగించనుంది.
